రైతులను కేసీఆర్ మోసం చేశారు :జగ్గారెడ్డి

by  |
Congress MLA Jagga Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతులను సీఎం కేసీఆర్ మోసం చేశారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. కేంద్ర నిర్ణయాలను ఒకసారి వ్యతిరేకిస్తూ, మరోసారి మద్దతిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పోరాటం చేస్తానన్నారని తెలిపారు. ఢిల్లీలో మూడు రోజులపాటు ఉన్న సీఎం కేసీఆర్.. రైతుల ఉద్యమానికి ఎందుకు సంఘీభావం ప్రకటించలేదని అడిగారు. బీజేపీ, టీఆర్ఎస్‌ పార్టీలు రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన ఎప్పుడూ ఉండేది కాంగ్రెస్సేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Next Story