- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్పై చర్యలకు ఆదేశించిన ఎన్నికల సంఘం
by GSrikanth |
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది.

X
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజున నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ చర్యలకు సిద్ధమైంది. ఎన్నికల రోజున ఆయన మాట్లాడుతూ ఏ వ్యక్తికి ఓటు వేశారో పరోక్షంగా వెల్లడించారు. దీనిని ఎన్నికల ఉల్లంఘనగా పేర్కొంటూ ఈసీ చర్యలకు ఆదేశించింది. కాగా, ఈ అంశంపై ఇప్పటికే ఎన్నికల సంఘం కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని డెడ్లైన్ సైతం విధించింది. గడువు ముగిసినా వివరణ ఇవ్వకపోవడంతో చర్యలకు ఆదేశించింనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






