లారీ ఢీకొనడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి

by Kalyani |
లారీ ఢీకొనడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి
X

దిశ, యాచారం : లారీ వెనుక నుండి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి, గ్రామానికి చెందిన బట్టు శ్రీరాములు (45) ఇంజాపూర్ లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఆదివారం నగరం నుండి కోదాస్ పల్లిలోని తన అక్క వద్దకు వెళుతుండగా… రంగాపూర్ గ్రామం దాటినాక లోయపల్లికి వెళ్లే రోడ్డు వద్దకు చేరుకోగానే వెనక నుండి లారీ వచ్చి ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed