- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: నివర్ తుపాన్ కారణంగా ఏపీలోని రైతులు ఇప్పటికే సర్వం కోల్పోయారు. గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు పడి, చేతికొచ్చిన పంట సర్వనాశం అయింది. దాని నుంచి కోలుకోకముందే మరో భారీ వర్షం గండం ఏపీ ప్రజలను వెంటాడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే మన్నార్ గల్ఫ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయిగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధనంగా ట్రోపో ఆవరణ ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. రేపు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.