- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ధర్మ స్థాపనలో బసవేశ్వరుడి సేవలు గొప్పవి : డీకే అరుణ
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: హిందూ ధర్మ స్థాపనలో బసవేశ్వరుడి సేవలు గొప్పవని,ఆయన మార్గంలో మనం నడిచినప్పుడే నిజమైన నివాళులర్పించినట్లని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డికె అరుణ అన్నారు.శుక్రవారం బసవవేశ్వర జయంతి సందర్భంగా స్థానిక పద్మావతీ కాలనీలోని బసవేశ్వరుని విగ్రహంకు ఆమె పూలమాలలు వేసి ఘన్నంగా నివాళులర్పించి మాట్లాడారు.ఈ ప్రాంతాల్లో వీరశైవ లింగాయత్ ప్రభావం అధికమని,నేను మంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశామని,మా ఇంట్లో వీరశైవ లింగాయత్ ల ఆచారం కొనసాగిస్తున్నామని ఆమె అన్నారు.వీరశైవ లింగాయత్ లకు.ఏ సమస్య వచ్చినా తాను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు.దేశ భవిష్యత్తు కోసం జరిగే ఈ ఎన్నికల్లో బీజేపీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కెఎస్.రవికుమార్,శివుడు,శ్రీశైలం,రాజసింహుడు,సిద్ధిరామప్ప,లింగంపల్లి చంద్రశేఖర్,గాంధీ,వీరణ్ణ,సిద్ధి లింగం,రాజ్ కుమార్,నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు.