షేక్‌పేట్‌లో హోరాహోరీ.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు స్వల్ప ఆధిక్యం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-14 03:43:19  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగిసింది.

షేక్‌పేట్‌లో హోరాహోరీ.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు స్వల్ప ఆధిక్యం
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగిసింది. అనంతరం అధికారులు ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కేవలం 62 ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత‌ గట్టి పోటీ ఇస్తుండగా.. బీబేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి పూర్తిగా వెనుకబడ్డారు. తొలి రౌండ్‌‌లో బీఆర్ఎస్‌కు 8,864 ఓట్లు పోల్ కాగా.. కాంగ్రెస్‌కు 8,926, బీజేపీకి 10 ఓట్లు వచ్చాయి.

Read More..

Jubilee Hills: కౌంటింగ్ హాల్‍లో గందరగోళం.. నిరసనకు దిగిన ఏజెంట్లు

ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. అధికార పార్టీకి స్వల్ప ఆధిక్యం

Next Story