ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. అధికార పార్టీకి స్వల్ప ఆధిక్యం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-14 03:12:00  IST  )

జూబ్లీహిల్స్ బై పోల్ ఓట్ల లెక్కింపు సరిగ్గా ఉదయం 8 గంటలకు నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. అధికార పార్టీకి స్వల్ప ఆధిక్యం
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ బై పోల్ ఓట్ల లెక్కింపు సరిగ్గా ఉదయం 8 గంటలకు నగరంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. లెక్కింపు కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా పోలైన 101 పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను అధికారులు లెక్కించారు. అయితే, ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 39 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 36 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 10 ఓట్లు వచ్చాయి. దీంతో పోస్టల్ ఓట్లలో అధికార పార్టీ కేవలం ఓట్ల అధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం అధికారులు EVM‌ల సీల్స్‌ను ఓపెన్ చేసి లెక్కింపునకు సిద్ధమవుతున్నారు.

Read More..

నాకు 45 వేల మెజారిటీ పక్కా.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

Next Story