వైఎస్ వివేకా మర్డర్.. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఛానల్ పెట్టిన ఆర్జీవీ.. ఆ ట్వీట్ వైరల్

by Disha Web Desk 7 |
వైఎస్ వివేకా మర్డర్.. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఛానల్ పెట్టిన ఆర్జీవీ.. ఆ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కిస్తున్న విషయం వివేకానంద రెడ్డి హత్య కేసు. గత కొంత కాలంగా ఈ కేసుపై విచారణ, వాదోపవాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ కేసులు ఎటువంటి మార్పు రాలేదు. అయితే.. ఈ మర్డర్ కేసుపై నిగ్గ తేల్చే పనిలో పడ్డాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్‌ను సైతం క్రియేట్ చేశారు.

‘‘వివేకా మర్డర్ వెనక నిజంలోని అబద్ధాలు, ఆ అబద్ధాలు చెప్పే వాళ్ల వెనక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనక వేరే వాళ్లు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ల పైవాళ్లు అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు, వాటన్నింటి వెనుక నిజాలన్నింటినీ తవ్వి తీయడమే "నిజం" ఛానల్ ముఖ్య ఉద్దేశం’’ అంటూ క్యాప్షన్ ఇచ్చి కొత్త ఛానల్‌ను స్టార్ట్ చేశాడు వర్మ. మరి వర్మ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వరకు వైఎస్ వివేకా మర్డర్ కేసుకు ఉపయోగ పడుతుందో వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

Viveka Case: కీలక పరిణామం.. సీబీఐ కార్యాలయానికి వివేకా హత్య నాటి ఎస్పీ రాహుల్ దేవ్

'కలిసి ఉండేంత టైం దొరకడం లేదు'.. విడాకుల పుకార్లపై షోయబ్ మాలిక్ క్లారిటీ

Breaking: ఒక్క రోజు ముందే అమరావతిలో హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు

Next Story

Most Viewed