'కలిసి ఉండేంత టైం దొరకడం లేదు'.. విడాకుల పుకార్లపై షోయబ్ మాలిక్ క్లారిటీ

by Disha Web Desk 13 |
కలిసి ఉండేంత టైం దొరకడం లేదు.. విడాకుల పుకార్లపై షోయబ్ మాలిక్ క్లారిటీ
X

హైదరాబాద్: భారత్, పాకిస్తాన్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో ఒకరు సానియా మీర్జా, షోయబ్ మాలిక్. వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారన్న పుకార్లతో గత కొద్ది నెలలుగా వార్తల్లోకెక్కుతున్నారు. 2010లో వివాహం చేసుకున్న సానియా, షోయబ్ ఎన్నడూ లేనంతగా వార్తల్లో ప్రధానంగా నిలుస్తున్నారు. వీరి వివాహ బంధం ఇబ్బందుల్లో ఉందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. సానియా, షోయబ్ చాలా రోజులుగా వేరు వేరుగా ఉంటున్నారంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై గానీ, వ్యక్తిగత జీవితంపై గానీ సానియా ఎన్నడూ మాట్లాడలేదు.

కానీ, షోయబ్ మాలిక్ ఈద్ సందర్భంగా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటన్నిటికి వివరణ ఇచ్చాడు. ‘హమే సాత్ మే రహనేకా టైం నహీ మిల్ రహా (కలిసి ఉండేందుకు టైం దొరకడం లేదు). ‘వాళ్లు (సానియా, ఇజహాన్) ఉమ్రాకు (తీర్థయాత్ర) వెళితే నాకు కమిట్‌మెంట్స్ ఉంటాయి. నాకు బ్రేక్ దొరికినప్పుడు దుబాయ్‌కి వెళితే ఆమెకు ఐపీఎల్ కమిట్‌మెంట్స్ ఉంటాయి. మేము రెండు దేశాలకు చెందిన వాళ్లమని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మాకు సొంత కమిట్‌మెంట్స్ ఉన్నాయి’ అని షోయబ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో సానియా తన భర్త పేరును తీసివేయడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి:

వైఎస్ వివేకా మర్డర్.. నిజాలు నిగ్గు తేల్చేందుకు ఛానల్ పెట్టిన ఆర్జీవీ.. ఆ ట్వీట్ వైరల్

Next Story

Most Viewed