చిరంజీవి, మహేశ్ బాబులకు షాకిచ్చిన నిర్మాతలు

by Disha Web Desk 9 |
చిరంజీవి, మహేశ్ బాబులకు షాకిచ్చిన నిర్మాతలు
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమాలు ఎంత కష్టపడి మంచిగా తీసినా, సరైన సమయంలో రిలీజ్ చేయపోతే వాటికి ఫలితం దక్కదు. టాలీవుడ్ డైరెక్టర్స్ ఎక్కువగా సంక్రాంతి పండగ సందర్భంగా సినిమాలు విడుదల చేయాలని అనుకుంటారు. ఆ సమయంలో రిలీజ్ చేస్తే సినియా కాస్త అటూ ఇటూ ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం. ఇదేకాక అత్యంతకంగా వసూళ్ళు సాధించేది కూడా సంక్రాంతికే. ఈ పండగ సినిమాలకు అదృష్టంగా భావిస్తారు. ఇటీవల రిలీజైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల ఫలితాలు దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రాలకు యావరేజ్ రేటింగ్ వచ్చినా.. సీజన్ కలిసి రావడంతో భారీ ఎత్తున వసూళ్ళు సాధించాయి.

తాజాగా భోళా శంకర్ మూవీకి కూడా చిరంజీవి అలాంటి గోల్డెన్ తేదీని పెట్టారు. ఈ చిత్రానికి ఆగస్టు 12 నుంచి 15 వరకు వరుసగా హాలీడేస్ రావడంతో ఆగష్టు 11న విడుదల చేస్తామని అధికారికంగా తెలిపారు. మరొక ట్విస్ట్ ఏంటంటే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘SSMB’ చిత్రాన్ని నాగవంశీ అదే రోజున విడుదల చేయాలనుకున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. ఇలా ఓకేరోజు అగ్రహీరోలు సినిమాలు రిలీజ్ అవుతుండటంతో అటు చిరంజీవి, ఇటు మహేశ్ బాబు షాక్ తిన్నారట. మరీ ఆ తేదీన సినిమాని విడుదల చేయాలా? వద్దా? లేక మరో తేదీని ఫిక్స్ చేద్దామా అనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు.

ఇవి కూడా చదవండి:

గురువారం నుంచి ‘సైంధవ్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

ఉగాది రోజున మెరిసిపోయిన ఘంటమనేని గారాల పట్టి.. నెట్టింట తెగ వైరల్

Next Story

Most Viewed