ఉగాది రోజున మెరిసిపోయిన ఘట్టమనేని గారాల పట్టి.. నెట్టింట తెగ వైరల్

by Disha Web Desk 9 |
ఉగాది రోజున మెరిసిపోయిన ఘట్టమనేని గారాల పట్టి.. నెట్టింట తెగ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇటీవల తన ముద్దుల కుమార్తె సితార సెకండరీ స్కూల్‌కు గ్రాడ్యుయేషన్ అవుతోందని తెలియజేసి మురిసిపోతూ వీడియో షేర్ చేసింది. అయితే తాజాగా ఉగాది పండుగ సందర్భంగా తన గారాల పట్టి సితార పసుపు, ఆకుపచ్చని పట్టుబట్టల్లో బుట్టబొమ్మలా తయారైన ఫొటోలను నమ్రతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

తన కుమార్తె అందాన్ని చూసి నమ్రత గర్వపడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫొటోలకు వారి అభిమానులు...‘ సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సితార కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, సెలెబ్రిటీ రేంజ్‌లో పోస్టులు పెడుతూ ఉంటుంది. ‘సర్కారు వారి పాట’ చిత్రంలో పెన్నీ సాంగ్ ప్రమోషనల్ వీడియోలో సితార నటించిన విషయం తెలిసిందే. అలాగే వారి కుమారుడు గౌతమ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘నేనొక్కడినే’ చిత్రంలో నటించారు. త్వరలో వీరు వెండితెరపై మెరవనున్నారు. మహేష్‌బాబు కూడా పిల్లలు ఎంచుకున్న రంగాల్లోనే వెళ్లడానికి వారి ప్రోత్సహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Bholashankar: ఉగాది సందర్భంగా.. ‘భోళాశంకర్’ నుంచి బిగ్ అప్‌డేట్



Next Story

Most Viewed