Rajamouli: ఆస్కార్ ఈవెంట్‌కు రాజ‌మౌళి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?

by Disha Web Desk 10 |
Rajamouli: ఆస్కార్ ఈవెంట్‌కు రాజ‌మౌళి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?
X

దిశ, సినిమా: ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాట‌కుగాను బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన సంగ‌తి తెలిసిందే. కాగా మ్యూజిక్ డైరెక్టర్ కీర‌వాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ అవార్డును వేదికపై అందుకున్నారు. అయితే ఈ ఆస్కార్ లైవ్ ఈవెంట్‌లో పాల్గొన‌డానికి రాజ‌మౌళి భారీగానే ఖ‌ర్చుచేశాడట. వాస్తవానికి ఆస్కార్ విన్నర్స్‌కు మాత్రమే లైవ్ ఈవెంట్‌లో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది. విన్నర్‌తో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్‌కి చాయిస్ ఉంటుందంతే. ఇక మిగిలిన వారు ఆస్కార్ ఈవెంట్‌ను లైవ్‌గా వీక్షించాలంటే టికెట్ కొనాల్సిందే. ఇందులో భాగంగా రాజమౌళి, తన ఫ్యామిలీ మొత్తం పాల్గొనేందుకు టికెట్స్ కోస‌ం కోటిన్నర‌కుపైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. తన సినిమాకు అవార్డును ప్రక‌టించే ఆనంద క్షణాల‌ను ప్రత్యక్షంగా ఆస్వాదించడం కోసం ఖర్చు గురించి జక్కన్న ఏమాత్రం ఆలోచించలేదట.

ఇవి కూడా చదవండి :

అది వెబ్ సిరీస్ కాదు బ్లూ ఫిల్మ్‌.. టాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్

డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ పి వి సతీష్ మృతి


Next Story

Most Viewed