వివాదంలో ‘ఆదిపురుష్’.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు!

by Disha Web Desk 9 |
వివాదంలో ‘ఆదిపురుష్’.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు!
X

దిశ, వెబ్‌డెస్క్: మహాకావ్యం రామాయణం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రముఖ తారాగణంతో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. భారీ హైప్‌తో విడుదలైన ఈ మూవీ.. అంచనాలను చేరుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మూవీపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, హిందు సేన గుప్తా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రం రామాయణాన్ని, రాముడిని అపహాస్యం చేసే విధంగా ఉందని మండిపడ్డారు. రాముడు, రావణుడు, సీత, హనుమంతుడికి సంబంధించిన అభ్యంతకర సన్నివేశాలు తొలగించేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోర్టును కోరారు.

ఇవి కూడా చదవండి:

బీరు బాటిల్‌తో దారుణంగా చేయి కోసుకుని.. ప్రభాస్ ఫొటోకు తిలకం దిద్దిన వీరాభిమాని..

ఆదిపురుష్ రిలీజ్ రోజే డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ




Next Story

Most Viewed