బ్రేకింగ్ న్యూస్... శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

by Disha Web Desk 12 |
బ్రేకింగ్ న్యూస్... శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీచైతన్య కాలేజీలో షాద్ నగర్ కు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నార్సింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ రాత్రి 10. 30 సమయంలో క్లాస్ రూంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే సాత్విక్ ఇలా చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగిన సాత్విక్ ఆత్మహత్య పై శ్రీచైతన్య యాజమాన్యం స్పందించ లేదు. ప్రాణపాయ స్థితిలో ఉన్న విద్యార్థిని కనీసం ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

దీంతో సాత్విక్‌ను కిందకు దించిన విద్యార్థులు రోడ్డుపై వెళుతున్న బైకర్‌ను లిఫ్ట్ అడిగి ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే సాత్విక్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. గతంలో సాత్విక్ ను లెక్చరర్స్ కొట్టడంతో 15 రోజుల పాటు ఆస్పత్రిపాలయ్యడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ సమయంలోనే అతన్ని ఏం అనొద్దని యాజమాన్యానికి చెప్పామని, అయినా కూడా యాజమాన్యం వినలేదని.. తమ కొడుకు మృతికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని సాత్విక్ తల్లిదండ్రులు అంటున్నారు. సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. కాగా, సాత్విక్ ఆత్మహత్య వెలుగు చూడగానే వార్డెన్ నరేష్ గోడ దూకి పారిపోవటం గమనార్హం.

Also Read: నార్సింగ్ శ్రీచైతన్య యాజమాన్యం పై కేసు నమోదు

Also Read: మనోవేదనకు గురై సాత్విక్ సూసైడ్! చితకబాదిన దృశ్యాలు వైరల్ (వీడియో)

Also Read: సాత్విక్ సూసైడ్ కేసు: ప్రభుత్వం సీరియస్


Next Story

Most Viewed