నార్సింగ్ శ్రీచైతన్య యాజమాన్యం పై కేసు నమోదు

by Disha Web Desk 12 |
నార్సింగ్ శ్రీచైతన్య యాజమాన్యం పై కేసు నమోదు
X

దిశ తెలంగాణ, క్రైమ్ బ్యూరో: నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ క్లాస్ రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సాత్విక్ తండ్రి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కాలేజీ టీచర్లు కృష్ణా రెడ్డి, ఆచార్య తో పాటు వార్డెన్ నరేష్ పై కేసులు నమోదు చేశారు. తనను కాలేజీలో కొడుతున్నారని సాత్విక్ చెప్పినట్టు అతని తండ్రి నాగుల రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, వార్డెన్ నాగరాజు పై విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. సాత్విక్ ఉరి వేసుకోవడం చూసి తాము కేకలు పెట్టగా నరేష్ గది వద్దకు వచ్చినట్లు చెప్పారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళదాము చెప్పగా నరేష్ తమను తిట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టాడని తెలిపారు. పైగా గదికి తాళం వేసినట్లు చెప్పారు. సకాలంలో హాస్పిటల్‌కి తీసుకెళ్లి ఉంటే సాత్విక్ బతికేవాడేమో అని విద్యార్థులు అన్నారు.

Also Read: సాత్విక్ సూసైడ్ కేసు: ప్రభుత్వం సీరియస్

Next Story