- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్లో మరో మర్డర్.. యువతిని అత్యంత కిరాతకంగా..
హైదరాబాద్లో మరో మర్డర్.. యువతిని అత్యంత కిరాతకంగా..

దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్(Hyderabad)లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముషీరాబాద్(Mushirabad) బాపూజీ నగర్ బస్తీలో పవిత్ర(17) అనే యువతిని సొంత మేన బావ కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. పవిత్ర తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్కు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇవాళ ఉదయమే మల్కాజిగిలోని జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్న సాకేత్ కాలనీ ఫోస్టర్ బిల్లాబాంగ్ స్కూల్ సమీపంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం స్కూటీపై వెళుతున్న వెంకటరత్నం అనే రియల్టర్ను వెంబడించి.. కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే సిటీలో మరో మర్డర్ జరుగడం కలకలం రేపుతోంది.
Read More... హైదరాబాద్లో మరో మర్డర్.. యువతిని అత్యంత కిరాతకంగా..






