- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్లో అడుగు పెట్టేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పుష్ప సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్కు ఏమాత్రం కొదవ ఉండదని మూవీ టీం ధీమా వ్యక్తం చేస్తోంది. దాన్ని ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ నిరూపించాయి. సుకుమార్ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలుండగా వారికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది పుష్ప టీమ్. ఈ సినిమాలో అందరినీ ఉర్రూతలూగించేందుకు స్పెషల్ పాటను డిజైన్ చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ పాటకు స్టార్ హీరోయిన్ సమంత స్టెప్పులేయనుందని ప్రకటించింది.
ఈ క్రమంలో సమంత కోసం బన్నీ బాలీవుడ్కి వెళ్లాడని సోషల్ మీడియాలో వార్తలు తెగ వినిపిస్తున్నాయి. సాధారణంగా తెలుగులో స్పెషల్ పాటలంటే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారు. వారిలో జానీ మాస్టర్ పక్కా మాస్ స్టైల్తో విరుచుకుపడితే, శేఖర్ మాత్రం కాస్త క్లాస్ టచ్తో ఊపు ఊపేస్తాడు. అయితే పుష్ప సినిమాలో సమంత చేయనున్న పాట కోసం బన్నీ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యను రంగంలోకి దించాడని టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలోనూ ఇదే హాట్టాపిక్.
క్లాసికల్ మాస్ మసాలా పాటలకు గణేష్ పెట్టింది పేరు. ఏ పాటైనా హీరోకు తగ్గట్టుగా కొరియోగ్రఫీ చేస్తాడు. ఇదివరకే బన్నీ డీజే సినిమాలోని ‘గుడిలో బడిలో’ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. దాంతో ఇప్పుడు బన్నీ మళ్లీ గణేష్నే సెలక్ట్ చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. త్వరలో మూవీ టీమ్ ఏమైనా అనౌన్స్ చేస్తుందేమో వేచి చూడాలి.
విడాకుల తర్వాత సమంతను వెనకుండి నడిపిస్తున్న తల్లి
పూజా హెగ్దె కొత్త కోరిక.. తీరేదెప్పుడో..
- Tags
- allu arjun
- bunny