- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సామాన్యుల బతుకు భారమైపోయింది: జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి
దిశ, నెల్లూరు: అవకాశం ఇస్తే ప్రజా సమస్యలపై పోరాటం చేసి సమస్యలే లేని నగరంలా నెల్లూరును తీర్చిదిద్దుతామని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు వేణుగోపాల్లో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. గడిచిన మూడున్నర సంవత్సరాలు కాలంలో వైసీపీ పాలనలో సామాన్యుల జీవితాలు బతుకు భారమై పోయిందన్నారు. నిత్యవసర సరుకులు కరెంటు చార్జీలు అమాంతం పెంచేసి రోడ్లు దుస్థితి దారుణమైన పరిస్థితిలో ఉండగా సీఎం జగన్ పాలన రాక్షస పాలనను తలపిస్తుందని విమర్శించారు, ఉద్యోగస్తుల జీతాలు సమయానికి అందించలేక యువతకు ఉపాధి కల్పించలేకపోతున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో దౌర్జన్యాలు దాడులు పెట్టరేగిపోయి ఒక క్రైమ్ క్యాపిటల్ తయారైపోతుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పాలన ప్రజల ఆరోగ్యానికి హానికరం అన్న చందాన వ్యవహరిస్తుందని, వైసీపీ ప్రభుత్వం గద్దె దిగుతుందా అని ప్రజలు వేచి చూస్తున్నారని మనుక్రాంత్ పేర్కొన్నారు.