ఘోర బస్సు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి లోకేష్

by Jakkula.Mamatha |   (  Updated:2025-12-12 04:15:08  IST  )

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారిమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

ఘోర బస్సు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి లోకేష్
X

దిశ,వెబ్‌డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డు రాజుగారిమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదం పై ఏపీ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో దుర్మరణం పాలవడం బాధాకరం. ప్రమాద ఘటనపై మంత్రి లోకేష్ హోంమంత్రి అనితతో ఫోన్ లో మాట్లాడి, వివరాలు ఆరా తీశారు. సహాయ కార్యక్రమాలు వేగంగా జరిగేలా చూడాలని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read More..

మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం.. ప్రమాద స్థలానికి బయలుదేరిన హోంమంత్రి అనిత

ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. స్పందించిన పవన్ కల్యాణ్

Next Story