ఏపీలో పెద్ద కుట్ర జరుగుతోంది.. Minister Bosta సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
ఏపీలో పెద్ద కుట్ర జరుగుతోంది.. Minister Bosta సంచలన వ్యాఖ్యలు
X

దిశ వెబ్ డెస్క్: ఏపీలో పెద్ద కుట్ర జరుగుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీని తిరిగి అధికారంలోకి రాకుండా చేసేందుకు పెద్ద కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పది మంది ఆస్తుల కోసం కోట్లాది ప్రజల ఆస్తులు అమరావతిలో కుమ్మరించాలా అని ప్రశ్నించారు. విశాఖ రాజధాని అశోక్ గజపతి రాజుకు ఇష్టం లేదని చెప్పారు. కేంద్రమంత్రిగా ఉండి ఎయిర్ పోర్టు నిర్మించలేదని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

కాగా ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని పలు సందర్భాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధాని చేయాలని అటు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే అమరావతికే కట్టుబడి ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నామని వైసీపీ నేతలు చెప్పిన మాటలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత మాట మార్చిన విధానంపై విమర్శలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి :

1.అసంతృప్తులకు గుడ్ న్యూస్.. Y. S. Jagan Mohan Reddy వ్యుహామిదే!

2.APకి ప్రత్యేక హోదా లేదు.. Polavaramపై కేంద్రం కొత్త మెలిక

Next Story

Most Viewed