బిల్డింగ్ పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి

by  |
బిల్డింగ్ పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి
X

దిశ, చేవెళ్ల : చేవెళ్లలో దారుణం చోటుచేసుకుంది. టెంట్ వేసేందుకు ఇంటి పైకి వెళ్లిన వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన చేవెళ్ల మండలం కమ్మెట గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలోకి వెళ్ళితే.. కమ్మెట గ్రామానికి చెందిన బ్యాగారి దశరథ్ తండ్రి పెంటయ్య (40)అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. గృహప్రవేశం సందర్భంగా బిల్డింగ్ పై టెంట్ వేసేందుకు వెళ్లారు. అక్కడి నుంచి కిందపడి మృతి చెందారు. కిందపడటంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed