కేసీఆర్ ఫామ్ హౌస్‌లో యువకుడి మృతి.. షాక్‌లో సీఎం

by Anukaran |   ( Updated:2021-12-22 01:06:10.0  )
KCR111
X

దిశ,వెబ్‌డెస్క్ : ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కూలి పనికి వెళ్లిన యువకుడు అక్కడి వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ క్షేత్రంలోకి చాలా మంది కూలీలు పనికోసం వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఎర్రవల్లి పక్కనే ఉన్న వరద రాజాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు (19) మంగళవారం ఫామ్ హౌస్ ‌లో కూలి పనులకోసం వెళ్లాడు. అయితే ఆయన అక్కడ పనిచేస్తున్నక్రమంలో ఓ బావి వద్ద చెట్ల పొదలు ఉన్నాయి. వాటిని తొలగించాలని అధికారులు చెప్పడంతో వాటిని తొలిగిస్తూ ఆబావిలో జారిపడిపోయాడు. అతన్ని బావిలో నుంచి బయటకు తీసేసరికి అతను చనిపోవడంతో ఎర్రవల్లి ఫాహౌస్ ముందు అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

ఇంతకన్నా హేయం ఉంటుందా? పీయూష్ గోయల్‌పై హరీష్ హాట్ కామెంట్స్

Next Story

Most Viewed