ఇంతకన్నా హేయం ఉంటుందా? పీయూష్ గోయల్‌పై హరీష్ హాట్ కామెంట్స్

by  |
ఇంతకన్నా హేయం ఉంటుందా? పీయూష్ గోయల్‌పై హరీష్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతుల పేరుతో టీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు స్పందించారు. పీయూష్ గోయల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, రాజకీయం చేసింది మీరేనని విమర్శించారు. మంత్రులను కలిసేందుకు సమయం లేదు కానీ, బీజేపీ నేతలను మాత్రం కలుస్తారా? అంటూ ప్రశ్నించారు.

‘మంత్రులను పట్టుకొని పనిలేదని అంటారా? రాష్ట్రం నుంచి అధికారిక బృందం వస్తే కలవకుండా రాజకీయం చేసింది మీరు. ఇదెక్కడి నీతి’ అని హరీష్ ప్రశ్నించారు. ‘ఎంత ప్రాధాన్యత ఉంటే ఆరుగురు మంత్రులు ఢిల్లీ వస్తారు. ఇంత దుర్మార్గంగా మాట్లాడే నైతికత మీకు ఎక్కడిది.. ఇంతకన్నా హేయం ఎక్కడైనా ఉంటుందా?’ అని హరీష్ విమర్శించారు.



Next Story

Most Viewed