బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-01 05:26:42  IST  )

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన పార్లమెంట్ భవన్‌లో కేంద్రం కేబినెట్ సమావేశం అయింది.

బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
X

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) అధ్యక్షతన పార్లమెంట్ భవన్‌లో కేంద్రం కేబినెట్(Union Cabinet) సమావేశం అయింది. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌(Union Budget 2026-2027)కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు బడ్జెట్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తన బృందంతో కలిసి ఆర్థిక మంత్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిఠాయి తినిపించారు. సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తూ.. సంస్కరణలను పరుగులు పెట్టించే లక్ష్యంతోపాటు అంతర్జాతీయ ఒత్తిడులను, సుంకాలను తట్టుకునే చర్యలకు ప్రాధాన్యమిస్తూ 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రూపొందిచినట్లు సమాచారం. వరుసగా తొమ్మిదోసారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆదివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం ఇదే తొలిసారి.

Read More..

కేంద్ర బడ్జెట్ రాష్ట్రపతి ఆమోదం.. ఆర్ధిక మంత్రికి స్వీట్ తినిపించిన ద్రౌపది ముర్ము

Next Story