నెలరోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న మల్టీస్టారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-17 03:46:20  IST  )

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shivaraj Kumar), రాజ్. బి శెట్టి(Raj B. Shetty), ఉపేంద్ర(Upendra) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘45’.

నెలరోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న మల్టీస్టారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shivaraj Kumar), రాజ్. బి శెట్టి(Raj B. Shetty), ఉపేంద్ర(Upendra) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘45’. ఈ సినిమాతో ప్రముఖ సంగీత దర్శకుడు జన్య దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. భారీ అంచనాల మధ్య గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్‌ను మాత్రమే సొంతం చేసుకుంది. తర్వాత ఈ సినిమాను తెలుగులో నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల చేశారు. స్ట్రాంగ్ స్టార్ కాస్ట్, కొత్త కాన్సెప్ట్ ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక విడుదలై నెలరోజులు కూడా పూర్తి కాకముందే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవడం గమనార్హం. ‘45’ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5 సొంతం చేసుకుంది. జనవరి 23 నుంచి ఈ సినిమా కన్నడ భాషలో స్ట్రీమింగ్ కానున్నట్లు జీ5 ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, అలాగే ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్. బి శెట్టి నటనకు డిజిటల్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read More..

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ డీల్ ఫిక్స్.. ట్వీట్ వైరల్

Next Story