- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసోంలో కుప్పకూలిన సుఖోయ్-30 ఎంకేఐ విమానం.. ఇద్దరు పైలట్లు దుర్మరణం
అసోంలో సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం క్రాష్. ఇద్దరు పైలట్లు స్క్వాడ్రన్ లీడర్ అనూజు, ఫ్లైట్ లెఫ్టినెంట్ పుర్వేశ్ మృతి. విచారణకు ఆదేశించిన వాయుసేన.

దిశ, వెబ్ డెస్క్: భారతీయ వాయుసేన (IAF)కి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం (Sukhoi-30 MKI fighter jet) గురువారం సాయంత్రం అసోంలో నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. జోర్హాట్ ఎయిర్బేస్ (Jorhat Airbase) నుండి బయలుదేరిన ఈ యుద్ధ విమానం నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో రాడార్తో సంబంధాలు కోల్పోయింది. చొకిహోలా పరిధిలోని నిలిప్ బ్లాక్ సమీపంలోని కొండ ప్రాంతంలో ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తం అయిన అధికారులు విమానం కూలిపోయిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
కానీ ఈ విషాదకర ఘటనలో విమానంలోని ఇద్దరు పైలట్లు మృతి (Two pilots died) చెందినట్లు ఐఏఎఫ్ అధికారికంగా ధ్రువీకరించింది. మరణించిన వారిని స్క్వాడ్రన్ లీడర్ అనూజు, ఫ్లైట్ లెఫ్టినెంట్ పుర్వేశ్గా గుర్తించారు. వీరిద్దరూ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు, ఎజెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించినప్పటికీ, సమయం సరిపోక పోవడం తో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.
ఘటన నేపథ్యం
తేజ్పూర్ వైమానిక స్థావరం నుంచి శిక్షణ విన్యాసాల కోసం బయలుదేరిన కొద్దిసేపటికే ఈ యుద్ధ విమానం రాడార్ పరిధి నుంచి తప్పిపోయింది. అస్సాం-అరుణాచల్ సరిహద్దు ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విమానం కుప్పకూలినట్లు సెర్చ్ ఆపరేషన్లో తేలింది. వాతావరణం అనుకూలించక పోవడం, సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు.
విచారణకు ఆదేశం
ఈ ప్రమాదంపై భారత వైమానిక దళం ఉన్నత స్థాయి విచారణకు (Court of Inquiry) ఆదేశించింది. విమానం గాలిలో ఉన్నప్పుడు ఎదురైన సాంకేతిక సమస్యలు ఏమిటి? బ్లాక్ బాక్స్లో నమోదైన వివరాలు ఏమిటి? అనే కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ యువ పైలట్ల మృతికి రక్షణ శాఖ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.






