తెలంగాణ అసెంబ్లీలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

by Malleboina Mahesh |   (  Updated:2026-01-26 10:42:12  IST  )

77 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ అసెంబ్లీలో వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

తెలంగాణ అసెంబ్లీలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: 77 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా స్పీకర్ ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో శాసనమండలి సభ్యులు (MLCs), వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, అసెంబ్లీ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాసనసభ సిబ్బంది, మార్షల్స్ పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ గీతాన్ని ఆలపించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు.

READ MORE .....

విరిగిన జెండా కర్ర.. మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం

Next Story