భారత స్టార్ షట్లర్ PV సింధు అరుదైన ఘనత

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-22 12:39:27  IST  )

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అరుదైన ఘనత సాధించారు.

భారత స్టార్ షట్లర్ PV సింధు అరుదైన ఘనత
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(Shuttler PV Sindhu) అరుదైన ఘనత సాధించారు. ఇండోనేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ(Indonesia Masters Badminton Tournament) ప్రిక్వార్టర్ ఫైనల్‌లో సింధు విజయం సాధించారు. డెన్మార్క్ షట్లర్ ఫో లినే జేర్‌ఫీల్డ్‌ను సింధు ఓడించారు. ఈ విజయంతో సింధు అరుదైన రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 500 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన తొలి భారతీయ షట్లర్‌గా సింధు నిలిచారు. బ్యాడ్మింటన్‌ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో ఇప్పటి వరకు ఈ రికార్డును ఐదుగురు మాత్రమే అందుకున్నారు. ఇప్పుడు ఆరో ప్లేయర్‌గా సింధు నిలిచారు. భారత్‌ తరఫున ఈ ఘనత నెలకొల్పింది సింధునే కావడం విశేషం. కాగా, ఇండోనేషియా మాస్టర్స్‌లో తాజాగా జరిగిన ప్రీ క్వార్టర్స్​లో లైన్‌ హోజ్‌మార్క్‌ను ఎదుర్కొన్న సింధు 21-19, 21-18 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. దీంతో ఆమె క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. దీంతో సింధుకు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు వెల్లువెత్తాయి.

READ MORE ....

500వ విజయం సాధించిన సింధు.. తొలి ప్లేయర్‌గా రికార్డు

Next Story