TS RTC ఉగాది ఆఫర్.. వారందరికీ ఉచితంగా ప్రయాణం

by Disha Web Desk 19 |
TS RTC ఉగాది ఆఫర్.. వారందరికీ ఉచితంగా ప్రయాణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజారవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ పలు ఛార్జీలను పెంచుతూ ప్రయాణికులకు షాక్ ఇస్తున్న తరుణంలో ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఉగాది సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ప్రయాణికులను ఆకర్శించేందుకు ప్రతి పండుగకు ఏదో ఓ స్కీమ్‌తో ముందుకు వచ్చే సజ్జనార్.. ఉగాది పండుగను వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2 ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వీసుల్లో 65 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్‌కు ఉచితంగా ప్రయాణం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా సజ్జనార్ తెలియజేశారు. సీనియర్ సిటిజన్ ప్రయాణికులు తమ గుర్తింపు కార్డులను కండక్టర్ వద్ద చూపించడం ద్వారా ఈ సదుపాయం పొందే అవకాశం ఉందని తెలిపారు.


నీ బండారం బయటపెడతా.. నటుడిపై సోమీ షాకింగ్ కామెంట్స్


Next Story

Most Viewed