కేరళలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్డినరీ సర్వీసులకు కేబినెట్ ఆమోదం

by Malleboina Mahesh |   (  Updated:2026-06-10 07:03:40  IST  )

కేరళలోని కేఎస్‌ఆర్‌టీసీ (KSRTC) ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కేరళ కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేరళలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్డినరీ సర్వీసులకు కేబినెట్ ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇచ్చిన హామిల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free bus travel) హామి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం (UDF Govt) విజయం సాధించింది. దీంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కేఎస్‌ఆర్‌టీసీ ఆర్డినరీ సర్వీసులకు కేబినెట్ ఆమోదం (Cabinet approval) తెలిపినట్లు ముఖ్యమంత్రి వీడి సతీషన్ ఈ రోజు ప్రకటించారు. ఈ మేరకు ప్రతి సంవత్సరం ఇందుకోసం రూ. 800 కోట్లు అవసరం పడతాయని సీఎం స్పష్టం చేశారు.

దీంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తరహాలోనే కేరళ ప్రభుత్వం (Kerala Govt) కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన రాష్ట్రాల్లో చేరింది. అయితే కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) కి చెందిన కేవలం ఆర్డినరీ బస్సు సర్వీసులలో (Ordinary Bus Services) ప్రాథమికంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించే ప్రతిపాదనకు కేరళ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వి.డి. సతీశన్ మీడియాకు వెల్లడించారు.

ఈ పథకం ద్వారా కేరళలోని లక్షలాది మంది మహిళలకు, ముఖ్యంగా నిరుపేద, ఉద్యోగ, కార్మిక మహిళలకు ఎంతో ఆర్థిక ఉపశమనం కలగనుంది. అయితే, ఈ పథకాన్ని కేవలం ఆర్డినరీ బస్సులకే పరిమితం చేయకుండా.. ఇతర సర్వీసులకు కూడా విస్తరించాలని, అలాగే ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న కేఎస్‌ఆర్‌టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయిస్తుందనే దానిపై విపక్ష నేత వి.డి. సతీశన్ అసెంబ్లీ వేదికగా మీడియా ద్వారా చర్చ లేవనెత్తారు. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక జీవో (GO) త్వరలోనే విడుదల కానుంది.

మమతకు షాక్.. TMC కి మరో ఎంపీ రాజీనామా

Next Story