- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GST ఎగవేత.. కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్
జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ, తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు.

దిశ, వెబ్డెస్క్: జీఎస్టీ పన్ను ఎగవేత కేసులో ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ, తెలంగాణ కాంగ్రెస్ నేత సునీల్ కుమార్(Sunil Kumar) అరెస్ట్ అయ్యారు. బుధవారం ఉదయం అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దాదాపు రూ.28 కోట్ల పన్ను ఎగవేసినట్లు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారవేత్తలపై జీఎస్టీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేస్తునట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీల్ కుమార్ పోటీ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. రాజకీయాల్లో ఉంటూ భారీ వ్యాపారాలు నిర్వహిస్తున్న నేతల్లో సునీల్ కుమార్ అరెస్ట్ ఇప్పుడు గుబులు రేపుతోంది. పన్ను చెల్లింపుల్లో లోపాలు ఉన్న ఇతర నేతలపై కూడా అధికారులు దృష్టి సారించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
Read More..






