New Pensions: వారికి కూడా పెన్షన్.. ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

by Sathputhe Rajesh |   (  Updated:2022-08-06 12:47:55  IST  )

CM KCR Announces New Pensions will be given from 15 August| స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. 57 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. 36 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, మరో పది లక్షల మందికి ఇస్తామన్నారు

CM KCR Announces New Pensions will be given from 15 August
X

దిశ, వెబ్‌డెస్క్: CM KCR Announces New Pensions will be given from 15 August| స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. 57 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. 36 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, మరో పది లక్షల మందికి ఇస్తామన్నారు. మొత్తం 46 లక్షల మందికి కొత్తగా బార్ కోడ్ తో పెన్షన్ కార్డులు జారీ చేస్తామన్నారు. డయాలసీస్ రోగులకు కూడా ఆసరా పథకం కింద రూ.2,016 పెన్షన్ అందిస్తామన్నారు. ఈ నెల 15 నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అనాధ శరణాలయ పిల్లలను స్టేట్ చిల్డ్రన్ గా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వారి పూర్తి బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. 75 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: ప్రపంచ ఆదివాసీ దినాన్ని విజయవంతం చేయాలి: తుడుం దెబ్బ

Next Story