ప్రపంచ ఆదివాసీ దినాన్ని విజయవంతం చేయాలి: తుడుం దెబ్బ

by Dishanational1 |
ప్రపంచ ఆదివాసీ దినాన్ని విజయవంతం చేయాలి: తుడుం దెబ్బ
X

దిశ, ఖానాపూర్: ఆదివాసీల హక్కుల సాధనకు ప్రతి ఆదివాసీ నడుం బిగించాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గొంది నాగేశ్వర రావు అన్నారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రతి ఆదివాసీ గ్రామంలో ఆదివాసీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితిలో 197 దేశాలు అంగీకారంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకటించినట్లు ఆయన తెలిపారు. నర్సంపేట పట్టణంలోని పాకాల సెంటర్ నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దాకా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఆదివాసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, మహిళా పట్టణ కమిటీలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


Next Story

Most Viewed