Chandrababu Naidu కు కేంద్రం నుండి పిలుపు

by Disha Web Desk 4 |
Central Government Invites Chandrababu Naidu for Azadi ka Amrit Mahotsav Celebrations
X

దిశ, వెబ్‌డెస్క్: Central Government Invites Chandrababu Naidu for Azadi ka Amrit Mahotsav Celebrations| తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కేంద్ర ప్రభుత్వం నుండి పిలుపు వచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్ లో పాల్గొనేందుకు రావాలని చంద్రబాబుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపింది. ఈ మేరకు ఆగస్ట్ 6వ తేదీన చంద్రబాబు ఢిల్లికి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో జరగనున్న సమావేశంలో బాబు పాల్గొననున్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: ఉభయ గోదావరి జిల్లాలపై పవన్ ఫోకస్.. చెక్ పెట్టేందుకు వైసీపీ భారీ స్కెచ్



Next Story