రాష్ట్రంలో మరోసారి ఏసీబీ దాడుల కలకలం

by Malleboina Mahesh |   (  Updated:2026-06-23 06:34:13  IST  )

తెలంగాణలో ఏసీబీ (ACB) సంచలనం.. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇళ్లపై ఏకకాలంలో 10 చోట్ల దాడులు, సోదాలు!

రాష్ట్రంలో మరోసారి ఏసీబీ దాడుల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుస ఏసీబీ దాడులు (ACB raids) జరుగుతూ వందల కోట్ల అక్రమాస్తులు బయటపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే నమ్మదగిన సమాచారంతో, ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామునే అధికారులు రంగంలోకి దిగారు. దీంతో సూపరింటెండెంట్ మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఏక కాలంలో 10 ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తున్నారు. కాగా ఈ ఏసీబీ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

టీచర్ల నియామకం కుంభకోణం.. రాష్ట్రవ్యాప్తంగా ఈడీ దాడులు

Next Story