ప్రగతిభవన్‌ పేల్చేయాలంటూ రేవంత్ వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ కార్యకర్తల ఫిర్యాదు

by Sathputhe Rajesh |   (  Updated:2023-02-08 05:19:26  IST  )

ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చివేయాలని నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపిన విషయం తెలిసిందే.

ప్రగతిభవన్‌ పేల్చేయాలంటూ రేవంత్ వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ కార్యకర్తల ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: పేదలకు ఉపయోగపడని ప్రగతిభవన్ ను నక్సలైట్లు పేల్చివేయాలని నిన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపిన విషయం తెలిసిందే. కాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ములుగు, నర్సంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కార్యకర్తలు కోరారు. రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో నిరసన తెలపాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. గులాబీ శ్రేణులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ వ్యాఖ్యలు నక్సలైట్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి : రేవంత్ పాదయాత్ర రూట్ మ్యాప్‌పై గందరగోళం

Next Story