మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ వద్ద ఆందోళన.. ఖబడ్దార్ కేసీఆర్ అంటూ నినాదాలు

by Dishanational2 |
మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ వద్ద ఆందోళన.. ఖబడ్దార్ కేసీఆర్ అంటూ  నినాదాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వీఆర్‌ఏలు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం పీఆర్‌సీ, పదోన్నతులు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఖబడ్దార్ కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి పీఎస్‌కు తరలించారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు పిలుపునిచ్చారు. వీఆర్ఏల పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా వీఆర్ఏలను అరెస్టు చేస్తున్నారు. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వీఆర్ఏల అరెస్ట్‎ల పర్వం కొనసాగుతోంది. పోలీసుల అరెస్టు చేయడంపై వీఆర్ఏలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి : అసెంబ్లీ సాక్షిగా.. RTC అమ్మకంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు


Next Story