- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణతో ప్రధాని మోడీకి ఎంతో అనుబంధం.. సభలో బీజేపీ స్టేట్ చీఫ్ ఆసక్తికర ప్రసంగం
తెలంగాణతో ప్రధాని మోడీకి ఎంతో అనుబంధం ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణతో ప్రధాని మోడీకి ఎంతో అనుబంధం ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు అన్నారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో ఆయన ఆసక్తికర ప్రసంగం చేశారు. ప్రధానికి స్వాగతం పలకడానికి సభకు లక్షలాది మంది వచ్చారని, ఈ సభ రేపు తెలంగాణలో రాబోయేది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వానికి సంకేతమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి తెలంగాణతో ఎంతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఎందుకంటే నాడు నిజాం నుంచి హైదరాబాద్ స్టేట్ని దేశంలో విలీనం చేసిన రోజు సెప్టెంబర్ 17 అని, అదే రోజు ప్రధాని మోడీ పుట్టిన రోజు అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే, ప్రధాని తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 9,700 కోట్ల ప్రాజెక్టులను రాష్ట్రానికి, దేశానికి అంకితం చేశారని తెలిపారు.
నాడు భారత దేశంలో నక్సలైట్లు బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలను హతమార్చారని గుర్తుచేశారు. నేడు భారత దేశం మొత్తం కూడా నక్సలైట్స్ ముక్త్ భారత్గా అవతరించిందని, దాని ఘనత నరేంద్ర మోడీదన్నారు. మనం దేశ వ్యతిరేక శక్తులతో పోరాడుతున్నామని ఫైర్ అయ్యారు. దేశాన్ని దక్షిణాది, ఉత్తరాది అంటూ విభజించే పార్టీలతో కొట్లాడుతున్నామని వివరించారు. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్న శక్తులతో మనం పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు.






