- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీభవన్లో పీసీసీ, పీఏసీ విస్తృస్థాయి సమావేశం ప్రారంభం
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్లో పీసీసీ, పీఏసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమయింది.

దిశ, వెబ్డెస్క్: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్లో పీసీసీ, పీఏసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కారణాలను పునః పరిశీలించి.. వాటిపైనే పెద్ద ఎత్తున ప్రచారం చేసేలా ప్రణాళికలు రచించాలని ప్లాన్ చేస్తోంది. మున్సిపోల్స్ లోనూ కాంగ్రెస్ విజయం సాధించేలా పార్టీ నేతలకు అధిష్ఠానం దిశానిర్దేశం చేయనుంది. క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రతి వార్డు, డివిజన్ నుంచి ఆరుగురు చొప్పున అభ్యర్థుల జాబితాను రూపొందించి వారిలో సమర్థులైన వారికోసం సర్వే చేయాలని ఇప్పటికే అధిష్ఠానం నిర్ణయించింది.
Read More..






