భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చు.. అమిత్ షా-ఎన్టీఆర్ భేటీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చు.. అమిత్ షా-ఎన్టీఆర్ భేటీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: చేసిన అవినీతి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తప్పించుకోవడం అసాధ్యమని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. కేసీఆర్ కుటంబం ఈడీ విచారణకు సిద్దంగా ఉండాలని సూచించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర ఏంటో విచారణలో తేలుతుందన్నారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికే కవిత బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎంత ప్రయత్నం చేసినా అవినీతికి పాల్పడిన కేసీఆర్ ఫ్యామిలి తప్పించుకోలేదన్నారు. అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీపై సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. భవిష్యత్ లో ఏమైనా జరగవచ్చని అన్నారు. వీరిద్దరి భేటీలో రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చని అన్నారు. రజాకార్ల ఫైల్స్ సినిమా రావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటుననారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ జాకీయాల్లో కీలక మార్పు తీసుకురాబోతోందని అన్నారు.

NTR - అమిత్ షా భేటీకి అసలు కారణం ఇది.. కిషన్ రెడ్డి క్లారిటీ

NTR-అమిత్ షా భేటీపై RS ప్రవీణ్ కుమార్ సీరియస్

Next Story

Most Viewed