ఈడీ ఎదుట హాజరైన MLC కవిత

by GSrikanth |   (  Updated:2023-03-21 06:29:37  IST  )

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు.

ఈడీ ఎదుట హాజరైన MLC కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. సోమవారం(మార్చి 20) సుదీర్ఘంగా 10 గంటల పాటు విచారించిన అధికారులు.. మంగళవారం ఉదయం 11 గంటలకు మళ్లీ హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. దీంతో సమయానికి ఎమ్మెల్సీ కవిత ఈడీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత వెంట బీఆర్ఎస్ శ్రేణులు ఆఫీసుకు వెళ్లారు. ప్రస్తుతం కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Read more: ఈడీ నాపై తప్పుడు ప్రచారం చేస్తోంది: MLC కవిత

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ట్విస్ట్,,,ఫోన్లను మీడియాకు చూపించిన కవిత...రెండేళ్లలో ఎన్ని ఫోన్లు మార్చిందో తెలుసా?

Next Story