ప్రతిక్షణం BJP ఆలోచన అదే: కేంద్రంపై మంత్రి Harish Rao ఫైర్

by Disha Web Desk 19 |
ప్రతిక్షణం BJP ఆలోచన అదే: కేంద్రంపై మంత్రి Harish Rao ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో బీజేపీ ఏ పని నేరవేర్చిందో చెప్పాలని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని.. అలా ఇచ్చి ఉంటే ఇప్పటికే 15 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలన్నారు. ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రెండవ సారి అధికారంలోకి వస్తే.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారు.. ఇప్పటి వరకు ఎంత మంది అకౌంట్‌లో రూ.15 లక్షలు వేశారో చెప్పాలని నిలదీశారు. రూపాయి విలువ పెంచుతామన్నారు.. పెంచారా.. దించారా? అని ప్రశ్నించారు. ఎంతసేపూ ఎవరికి వెన్నుపోటు పొడవాలి.. దొంగదారిలో ఎలా గెలవాలన్నదే బీజేపీ ఆలోచన అని మండిపడ్డారు. కానీ, సీఎం కేసీఆర్ ప్రతిక్షణం ప్రజలకు ఎలా సేవ చేయాలని ఆలోచిస్తారని అన్నారు.

Minister Harish Rao: 4 రోజుల ముందే బండి సంజయ్‌కి ఆ విషయం ఎలా తెలుసు..?


Next Story

Most Viewed