- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Minister Harish Rao: 4 రోజుల ముందే బండి సంజయ్కి ఆ విషయం ఎలా తెలుసు..?
దిశ, వెబ్డెస్క్: బెంగళూరు డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. బీజేపీ రాజకీయ కుట్రలో భాగంగానే ఈడీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగు రోజుల క్రితమే అన్నారని.. ఈడీ నోటీసుల విషయం నాలుగు రోజుల ముందే బండి సంజయ్కి ఎలా తెలుసని ప్రశ్నించారు.
కాగా, 2021లో సంచలనం సృష్టించిన బెంగళూరు డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 19వ తేదీన ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.