Markapuram Bus Accident : దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-26 05:11:56  IST  )

మార్కాపురం బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Markapuram Bus Accident  : దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: మార్కాపురం (Markapuram) బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 13 మంది ప్రయాణికులు సజీవదహనమవ్వడం, కొందరు తీవ్రంగా గాయపడటం పట్ల షాక్‌కు గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న నేపథ్యంలో.. ప్రమాదంలో మృతిచెందిన, క్షతగాత్రుల వివరాలను ఏపీ సీఎస్ నుంచి తెలుసుకోవాలని సీఎస్ రామకృష్ణా రావును ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

Markapuram Bus Accident : బస్సు ప్రమాదంలో 12 మంది సజీవదహనం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, కీలక ఆదేశాలు

Next Story