- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone Tapping Case : నెక్స్ట్ కేసీఆర్కు నోటీసులు?.. కేటీఆర్ రియాక్షన్ ఇదే
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సింగరేణి విషయంలో కిషన్ రెడ్డి మౌనం దేనికి?:
రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి కోల్ టెండర్లు దక్కేలా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఈ విషయాన్ని నిన్న హరీశ్ రావు మాట్లాడగానే వెంటనే ఆయనకు నోటీసులు ఇచ్చారన్నారు. సింగరేణి స్కామ్ ను ఆధారాలతో సహా బయటపెడతామన్నారు. సైట్ విజిట్కు వచ్చిన కంపెనీలకు సృజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నారని ఆరోపించారు. నైనీ కోల్ బ్లాక్ రద్దు వెనుక వాటాల పంచాయతీ అన్నారు. ఒక ముఠాగా ఏర్పడి సింగరేణి టెండర్లలో గోల్ మాల్ జరుగిందని ఈ విషయాన్ని హరీశ్ రావు బయటపెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని బంగారు బాతులా చూస్తోందన్నారు. సింగరేణిలో ఇంత జరుగుతుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరగాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది:
కొంత మంది అధికారులు రేవంత్ రెడ్డి ఆడిస్తున్నట్లు ఆడుతున్నారని కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదన్నారు. ఎమర్జెన్సీ అయితే మీరంతా ఇక్కడ ఉన్న వారా అంటూ ఓ అధికారి మాట్లాడుతున్నారని అలాంటి వారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని కేటీఆర్ హెచ్చరించారు. తమను ఎంత వేధిస్తారో వేధించండి రేవంత్ రెడ్డిని, ఆయన చెప్పినట్లు ఆడుతున్న అధికారులను వదిలే ప్రసక్తే లేదన్నారు.






