ఆసుపత్రికి నుంచి ఇంటికెళ్లిన కేటీఆర్, హరీశ్.. డాక్టర్లు ఏం చెప్పారంటే?

by Disha Web Desk 2 |
ఆసుపత్రికి నుంచి ఇంటికెళ్లిన కేటీఆర్, హరీశ్.. డాక్టర్లు ఏం చెప్పారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఫాంహౌజ్‌లో కాలుజారి పడిపోయిన కేసీఆర్ హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తాజాగా.. ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, కేసీఆర్ అస్వస్థతకు గురైన వార్తా తెలిసిన కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు.

కేటీఆర్‌ కుటుంబంతోపాటు హరీష్‌రావు కూడా రాత్రే యశోదాకి వెళ్లారు. తెల్లవారుజాము వరకూ అక్కడే ఉన్నారు. వైద్యులతో మాట్లాడిన తర్వాత.. కాసేపట్లో చేయబోయే వైద్య పరీక్షలపై డాక్టర్లు క్లారిటీ ఇచ్చాక ఇంటికి వెళ్లారు. కేసీఆర్‌కి యశోదా ఆస్పత్రిలోని 9వ ఫ్లోర్‌లో చికిత్స కొనసాగుతోంది. ఇవాళ వైద్యులు టెస్ట్‌లు చేసిన తర్వాత హెల్త్‌ బులెటిన్‌ ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.

Read More..

ఆస్పత్రిలో KCR.. కవిత రియాక్షన్ ఇదే..!

కేసీఆర్‌కు తీవ్ర గాయాలు.. యశోద ఆసుపత్రిలో చికిత్స

Next Story

Most Viewed