బిగ్ బ్రేకింగ్: మే డే రోజున కార్మికులకు CM కేసీఆర్ భారీ గుడ్ న్యూస్

by Disha Web Desk 19 |
బిగ్ బ్రేకింగ్: మే డే రోజున కార్మికులకు CM కేసీఆర్ భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ మే డే రోజున పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు రూ.1000 వేతనం పెంచుతూ కేసీఆర్ కార్మికులకు మే డే గిప్ట్ ఇచ్చారు. ఇప్పటి నుండి పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెల జీతంతో పాటు అదనంగా రూ.1000 ఇవ్వాలని సోమవారం సీఎం నిర్ణయించారు. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేసీఆర్ తెలిపారు. కాగా, కేసీఆర్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 6 లక్షల 474 మంది పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది. మే డే రోజున రూ.1000 పెంచుతూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల పారిశుద్ధ్య కార్మికులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులకు కూడా జీతాలు పెంచుతామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు.

Read more:

సీఎం కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ : మంత్రి హరీష్ రావు


Next Story