Delhi Liquor Case : నేడు ఢిల్లీలో కవిత ప్రెస్ మీట్.. తీవ్ర ఉత్కంఠ

by Disha Web Desk 4 |
Delhi Liquor Case : నేడు ఢిల్లీలో కవిత ప్రెస్ మీట్.. తీవ్ర ఉత్కంఠ
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బుధవారం ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కవిత నిన్న ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. 10 న జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్లపై ఆమె దీక్ష చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు మీడియా ముందుకు రానున్నారు. అయితే నేటి విచారణ లేదన్నట్లు గానే సంకేతాలు వెలువడుతున్నాయి. కవిత 11న విచారణకు హాజరవుతానని ఈడీకి లేఖ రాశారు. కాగా విచారణకు సంబంధించి ఈడీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ప్రెస్ మీట్ లో కవిత ఏం మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి :

కవితను అరెస్ట్ చేస్తే ఏం చేద్దాం ?

కవితకు ఈడీ నోటీసులు: రేవంత్ రెడ్డి మౌనమెందుకు?


Next Story

Most Viewed