జనాభా లెక్కల కోసం ఇంటికి వెళ్తే.. అక్కడ కనిపించిన దృశ్యానికి అధికారి షాక్!

by Jakkula.Mamatha |   (  Updated:2026-05-13 06:07:34  IST  )

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో మంగళవారం రాత్రి సుమలత(28) అనే మహిళ దారుణ హత్యకు గురైంది.

జనాభా లెక్కల కోసం ఇంటికి వెళ్తే.. అక్కడ కనిపించిన దృశ్యానికి అధికారి షాక్!
X

దిశ, పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో మంగళవారం రాత్రి సుమలత(28) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. జనాభా లెక్కల సమాచారం కోసం బుధవారం ఉదయం ఓ అధికారి ఇంటికి వెళ్లగా, మహిళ మంచం పై రక్తపు మడుగులో పడి ఉండటం చూసి కేకలు వేశారు. దీంతో స్థానికులు గమనించి వెంటనే బసంత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే బసంత్ నగర్ ఎస్ఐ నూతి శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Breaking: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత

Next Story