- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇండియా–పాక్ ఉద్రిక్తతలు.. ఆ ఒప్పందం ప్రకారం ఆసుపత్రుల పై ప్రత్యేక గుర్తులు!?

దిశ,వెబ్డెస్క్: ప్రస్తుతం భారత్–పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ముందస్తు రక్షణగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో యుద్ధ పరిస్థితులు తలెత్తే అవకాశాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వా(Government)లు అప్రమత్తం అవుతున్నాయి. ఈ క్రమంలో వైద్య సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ తరుణంలో ప్రజలు, సైనికులకు వైద్య సేవలందించడంతో ఎలాంటి అంతరాయం కలగకూడదనే లక్ష్యంతో తెలంగాణ(Telanagana) రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ(Health Department) ముందస్తు చర్యలకు సిద్ధమైంది.
మానవతా భావంతో రూపొందించిన ఈ చర్యలు ప్రజల రక్షణతో పాటు వైద్య వ్యవస్థ స్థిరత్వాన్ని సమర్థవంతంగా కాపాడతాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధ సమయంలో ఆస్పత్రులు లక్ష్యంగా మారకుండా ఉండేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల భవనాలపై పెద్ద పరిమాణంలో రెడ్ క్రాస్(Red Cross) గుర్తులను పెయింట్ చేస్తున్నారు. వీటి ద్వారా జెట్లు, విమానాలు, డ్రోన్లు ఆ భవనాలను ఆస్పత్రులు(Hospital)గా సులభంగా గుర్తించగలరు. ఈ చర్య 1949లో జెనీవా(Geneva) ఒప్పందానికి అనుగుణంగా చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రకారం రెడ్ క్రాస్ గుర్తు ఉన్న భవనాలపై శత్రు దేశాలు దాడి చేయకూడదు.
Read More : కరాచీ హల్వా.. పేరు పాకిస్థాన్.. రుచి మాత్రం హిందుస్థాన్